కరోనాకు తోడు అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. వర్షాల కారణంగా నిండా మునిగామని, ఆదుకోవాలని పాలకులకు విన్నవించుకుంటున్నారు. కరోనా కట్టడికి దేశంలో అమలు చేస్తున్న ఆంక్షలతో నగరాల్లో ఉపాధి లేకపోవడంతో వలస కార్మికులు గ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. మరోవైపు సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు (సన్హాలో) బుధవారం కనువిందు చేసింది.