కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాయి. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సర్వే చేస్తున్నారు. ఇంటింటి సర్వే కారణంగా కరోనా పాజటివ్ రేట్ తగ్గు ముఖం పడుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా, కోవిడ్ విజృంభణకు అడ్డుకట్టవేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్తో పాటు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ‘టౌటే’ తుపాను ధాటికి కకావికలం అయిన మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.