ఉదయం 10 గంటలు దాటిన తర్వాత అనవసరంగా రోడ్డెక్కే వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినా.. నిబంధనలు కఠినతరం చేసినా నగర వాసుల్లో సీరియస్నెస్ కనిపించడం లేదు. అవసరార్థం రహదారులపైకి వస్తున్నవారు కొందరైతే.. కారణాలు లేకుండా వస్తున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. ఇలా రోడ్డుపైకి వచ్చిన వారిని పోలీసులు తనిఖీ చేశారు. అకారణంగా వచ్చిన వారికి జరిమానాలు విధించారు. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించినా నగర వాసులు కొందరు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఏవో సాకులు చెప్పి ఇష్టారీతిగా బండ్లపై తిరిగేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి.