రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అతలాకుతలమైంది. తొలకరి వర్షానికే వరంగల్ మహా నగరం వణికిపోయింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యధిక కిలోమీటర్లు తిరిగిన పల్లెవెలుగు బస్సులను లాజిస్టిక్ వ్యాన్లుగా మార్చుతోంది. ఏటా లక్షల టన్నుల బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణాన్ని సమతూకం చేసేందుకు దీక్షతో మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా సాగిస్తోంది.