సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ పది రోజుల పాటు(మే 21) వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో జనం సొంతూళ్లకు పయనం అయ్యారు. ఇక ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలకు సడలింపు ఇవ్వటంతో జనం పెద్ద ఎత్తున బయలుదేరి 10 గంటలలోపే తమ సొంతూళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలు ప్రాంతాలకు వెళ్లవల్సిన ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు. అందరూ ఒకేసారి రోడ్లపైకి రావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)