అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద లారీ బీభత్సం

11 Aug, 2020 22:09 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టిన‌ లారీ, ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకున్నాడు. డ్రైవర్ ను బయటకు తీసేందుకు  స్థానికులు శ్రమిస్తున్నారు.

మరిన్ని వార్తలు