చినజీయర్‌ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం 

18 Nov, 2020 03:56 IST|Sakshi

శంషాబాద్‌ రూరల్ ‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంగళవారం ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణంలో చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్‌కు అహోబిల జీయర్‌ స్వామి, ఆశ్రమం సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం దివ్యసాకేతాలయంలో చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో జరిపిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్‌కు చినజీయర్‌ స్వామి తీర్థ ప్రసాదాలు, మంగళశాసనాలు అందజేశారు. ఆశ్రమం సమీపంలో జరుగుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం పనులను జీయర్‌స్వామితో కలసి చౌహాన్‌ పరిశీలించారు.   

మరిన్ని వార్తలు