9 కిలోల ‘బంగారం’!

3 Mar, 2021 11:45 IST|Sakshi

కురవి: మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తిర్మలాపురం గ్రామంలోని చెరువులో మంగళవారం మత్య్సకారులు చేపలు పట్టారు. ఈ సందర్భంగా ఓ మత్స్యకారుడి వలలో తొమ్మిది కేజీల బరువున్న బంగారు వర్ణంలోని చేప పడింది. బంగారు తీగ రకానికి చెందిన ఈ చేప పూర్తిగా బంగారం రంగులో మెరిసిపోతుండగా, అదే గ్రామానికి చెందిన కల్లెపు కృష్ణ దీన్ని కొనుగోలు చేశారు. ఈ రకానికి చెందిన చేపలు అక్కడక్కడా బంగారు రంగుతో ఉండడం సహజమే అయినా, ఈ చెరువులో ఇంత పెద్ద చేప లభించడం ఇదే మొదటిసారని జాలరులు తెలిపారు. 

మరిన్ని వార్తలు