ఎంపీ మాలోతు కవితకు హైకోర్టులో ఊరట 

31 Jul, 2021 10:23 IST|Sakshi
మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితకు  తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో బూర్గంపహాడ్‌ మండలంలో డబ్బు పంపిణీ చేశారంటూ ఆమెపై నమోదుచేసిన కేసులో ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
 

మరిన్ని వార్తలు