రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

24 Mar, 2021 10:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌లో వెల్లడించారు. తనకు కోవిడ్‌–19 పాజిటివ్‌ వచ్చిందని, వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్‌లో ఉన్న ట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, సోమవారం అర్ధరాత్రి ఆయన ఢిల్లీ నుం చి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు రేవంత్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు