ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. కారులోని వ్యక్తి సజీవ దహనం

18 Sep, 2021 21:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌ రెండో లైనులో ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్దమైంది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రమాదానికి గురైన కారు ప్రకాశం జిల్లాకు చెందినదిగా స్థానికులు గుర్తించారు.

మరిన్ని వార్తలు