సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

11 Apr, 2021 12:10 IST|Sakshi

భార్య కాపురానికి రావడం లేదని ఆందోళన

సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భార్య కాపురానికి రావడం లేదని బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి ఆందోళన చేపట్టాడు. గత మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు సురేష్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగడం లేదంటూ , తన భార్యను పిల్లల్ని పిలిపించి మాట్లాడాలని కోరుతున్నాడు. సురేష్‌కు కుమార్తె,కుమారుడు ఉన్నారు. కాగా, సురేష్‌ను సెల్ టవర్ నుండి దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సురేష్‌ భార్యతో పోలీసులు సెల్‌ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు.


చదవండి:
దారుణం: భార్య, అత్తను గొడ్డలితో నరికి హత్య
కూకట్‌పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే!

మరిన్ని వార్తలు