స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. ముఖ్యనేతలతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం

4 Feb, 2023 09:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాణిక్‌రావు ఠాక్రే.. కాంగ్రెస్‌ నేతలతో గాంధీ భవన్‌లో సమావేశమై కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. 

కాగా, తాజాగా మరోసారి మాణిక్‌రావు ఠాక్రే హస్తం పార్టీ నేతలతో వరుసగా భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌లో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు ముఖ్య నేతలతో ఠాక్రే భేటీ కానున్నారు. 

మరిన్ని వార్తలు