Food Poisoning In Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్.. ఐదుగురికి అస్వస్థత

30 Nov, 2022 20:07 IST|Sakshi

సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మరోసారి విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!

మరిన్ని వార్తలు