Adilabad: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు గాల్లోకి లేచి..

25 Nov, 2022 19:24 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలోని రిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ అతివేగం కారణంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన షాకింగ్‌ వీడియో బయటకు వచ్చింది. 

వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆసుపత్రి వద్ద వేగంగా వస్తున్న ఓ బైక్‌.. మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో హై స్పీడ్‌లో బైక్‌ మీద వస్తున్న వ్యక్తితో సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంలో ఉన్న బైక్‌.. రెండు బైకులును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా గాల్లోకి లేచి రోడ్డుపై పడిపోయారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఇక, ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 

మరిన్ని వార్తలు