బండ కింద 21 పాము పిల్లలు

24 Mar, 2021 14:12 IST|Sakshi

సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్‌):  మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని ఒక మామిడితోటలో కాపలాదారు గది వద్ద మంగళవారం 21 పాము పిల్లలు బయటపడ్డాయి. గ్రామ సబ్‌స్టేషన్‌ దగ్గరలోని మామిడితోట వద్ద కాపలాదారు కోసం నిర్మించిన గది దగ్గర ముందుగా ఒక పాము పిల్ల కనిపించగా తోటకాపలాదారు చింతల వెంకటేశం దానిని చంపేశాడు. గది బయట బండ సందు నుంచి పాముపిల్ల రావడం గమనించిన ఆయన, బంను తొలగించి చూడగా అక్కడ 21 పాము పిల్లలు బయటపడ్డాయి. అనంతరం వాటిని కూడా చంపేశాడు.

చదవండి: ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! 

మరిన్ని వార్తలు