బీజేపీ సభ: అప్పటి వరకు మెట్రో సేవలు బంద్‌

3 Jul, 2022 12:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు మెట్రో సేవలను నిలిపి వేస్తున్నట్టు స్పష్టం చేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో సభ కారణంగానే 3 గంటల పాటు సేవలను నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: భాగ్యలక్ష్మి అ‍మ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు

>
మరిన్ని వార్తలు