Telangana:రెండేళ్ల సర్వీసుకే పదోన్నతుల గడువు పొడిగింపు

31 Aug, 2021 03:28 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన కనీస సర్వీసు కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 31తో ముగియనున్న 2020–21 పదోన్నతుల ప్యానెల్‌ ఈయర్‌ కోసం మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయితే తాజా నిర్ణయంతో ప్యానెల్‌ ఇయర్‌తో సంబంధం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ వరకు ఈ వెసులుబాటు అమలు కానుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ గ్రూప్‌–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌ నాయక్‌ స్వాగతించారు.  

>
మరిన్ని వార్తలు