కేసీఆర్‌ తర్వాత నేనే నంబర్‌ వన్‌: మంత్రి ఎర్రబెల్లి

13 Mar, 2023 11:15 IST|Sakshi

సాక్షి, వరంగల్‌(పర్వతగిరి): ‘కేసీఆర్‌ తర్వాత రాజకీయాల్లో నేనే నంబర్‌–1.. నాకెవరూ సాటిలేరు’.. ఈ మాటన్నది ఎవరో కాదు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఆయన ఆదివారం వరంగల్‌ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1987–88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి సమితి అధ్యక్షునిగా పోటీ చేసినప్పుడు టాస్‌ వేసి కాంగ్రెస్‌ వారు ఓడించారని తెలిపారు. అలా రెండు సందర్భాల్లో ఆ పార్టీ వారు కక్ష గట్టడంతో కసితో టీడీపీలో చేరానని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ఓడించానని తెలిపారు. 

మరిన్ని వార్తలు