సంచలనం: మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు

30 Apr, 2021 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు పలువురు రైతులు ఆరోపించారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో ఈటల తమ భూములు కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపించారు. అచ్చంపేట, హకీంపేట ప్రాంతంలో సుమారు 100 ఎకరాల భూమిని ఈటల కబ్జా చేశారని తెలిపారు. జమున హ్యాచరీస్ కోసం ఈటల తమ భూములు లాక్కున్నారని వెల్లడించారు. అచ్చంపేట, హకీంపేటలో దాదాపు 100 ఎకరాలు కబ్జా చేసినట్లు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

భూకబ్జా ఆరోపణలపై కాసేపట్లో ఈటల వివరణ ఇవ్వనున్నారు. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారంటున్నారు.

చదవండి: కేసీఆర్ నియోజకవర్గంలో ఇంత దారుణమా

మరిన్ని వార్తలు