'జాగ్ర‌త్త‌లు పాటిస్తూ పండుగ జ‌రుపుకోవాలి'

24 Oct, 2020 20:00 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : రాష్ర్ట ప్ర‌జ‌లంద‌రికీ మంత్రి హ‌రీష్ రావు బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కుటుంబ‌స‌మేతంగా సిద్ధిపేట‌లోని కోమ‌టి చెరువు వ‌ద్ద జ‌రుగుతున్న బ‌తుక‌మ్మ సంబురాల‌ను వీక్షించారు. ఇత‌ర దేశాల్లోనూ ఘ‌నంగా పండుగ‌ను జ‌రుపుకుంటున్నార‌ని తెలిపారు. క‌రోనా వ‌ల్ల కొంత ఇబ్బంది ఉన్నా సోష‌ల్ డిస్ట‌న్స్ పాటిస్తూ ప్ర‌జ‌లు బ‌తుక‌మ్మ సంబురాల్లో పాల్గొన్నార‌న్నారు. తెలంగాణ‌లో వ‌ర్షాలు బాగా ప‌డ‌టంతో చెరువులు నిండుకుండ‌టా మారి క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.  కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ పండుగ జ‌రుపుకోవాల‌ని మంత్రి హ‌రీష్ ప్ర‌జ‌ల‌కు విఙ్ఞ‌ప్తి చేశారు. (సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కల్వకుంట్ల కవిత)

మరిన్ని వార్తలు