ఈటల మల్లయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం

24 Aug, 2022 21:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఈటల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన కేటీఆర్‌.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న మల్లయ్య మెదక్‌ జిల్లాలోని ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌తో తుదిశ్వాస విడిచారు. మృతుడు మల్లయ్యకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు