అదృశ్యమైన బాలుడు అనీష్‌ మృతి

22 Oct, 2021 11:36 IST|Sakshi

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడు అనీష్‌ మృతి చెందాడు. ఆ బాలుడు మృతదేహం చెరువులో లభించింది.  ఇంటి వెనుకాలే ఉన్న చెరువులో బాలుడి మృతిదేహం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నిన్న మధ్యాహ్నం నుంచి అనీష్‌ కనిపించకపోవడంతో వెతకటం ప్రారంభించారు. కాగా, ఈ రోజు శవమై చెరువులో కనిపించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక బొమ్మ కొనివ్వని కారణంగా మారం చేశాడని, అదే క్రమంలో బయటకు వెళ్లిన తమ చిన్నారి అనీష్‌ ఇలా శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది. 

మరిన్ని వార్తలు