ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి పాజిటివ్‌

8 Aug, 2020 20:53 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారినపడిన పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కోలుకున్నారు. 

ఇక కాంగ్రెస్‌ కురువృద్ధుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.10 రోజుల క్రితం కరోనా బారినపడిన నంది ఎల్లయ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
(సిద్దిపేట ముద్దుబిడ్డ, ఐదుసార్లు అక్కడి నుంచే)

మరిన్ని వార్తలు