బెయిల్‌పై రామచంద్రభారతి విడుదల 

31 Dec, 2022 01:51 IST|Sakshi

చంచల్‌గూడ (హైదరాబాద్‌): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు రామచంద్రభారతి శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు­లో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న అతను కొద్దిరోజుల కిందట బెయిలుపై విడుదల కాగానే నకిలీ పాస్‌పోర్టు కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. దీంతో అతను తిరిగి ఈ నెల 22వ తేదీన జైలుకు వచ్చాడు. ఎట్టకేలకు మరలా అతనికి బెయిల్‌ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.  

మరిన్ని వార్తలు