Delhi Excise Scam: బీజేపీ ఏం చేసినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరు.. కవిత కీలక వ్యాఖ్యలు

22 Aug, 2022 12:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఉన్నారని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై సంచలన కామెంట్స్‌ చేశారు.

ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదు. బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై కొందరు తప్పుడు ప్రచారం చేశారు. 

ఏం జరిగినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరు. ఆయన పోరాటం ఆపరు. దేశ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది. మీరు అధికారంలో ఉన్నారని విచారణ సంస్థలు, మీడియాను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: ‘లిక్కర్‌ స్కామ్‌లో ‘కీ’ రోల్‌ కవితదే’.. కేసీఆర్‌ కూతురుకు బిగుస్తున్న ఉచ్చు?

మరిన్ని వార్తలు