గ్రేటర్‌లో2089 కోవిడ్‌ కేసులు

9 Jan, 2022 08:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో కోవిడ్‌ విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడిన వందలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. శనివారం సాయంత్రం వరకు గ్రేటర్‌లో 2089 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1583, రంగారెడ్డి జిల్లాలో 214, మేడ్చల్‌ జిల్లాలో 292 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు