పేట్ల బురుజు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం 

1 Mar, 2023 01:56 IST|Sakshi

ఎంపీ సంతోష్‌ కుమార్‌.. ఆస్పత్రి అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు  

సాక్షి, హైదరాబాద్‌: తాను జన్మించిన పేట్ల బురుజు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.కోటి వెచ్చిస్తానని గతంలో తానిచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రూ.50 లక్షలు అందజేస్తున్నట్టు తెలిపారు.

ఈ మేరకు రూ.50 లక్షలు మంజూరు ఉత్తర్వులను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.మాలతికి అందజేశారు.  

మరిన్ని వార్తలు