తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్లోని మూసారంబాగ్ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. ఇక, చాదర్ఘాట్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) July 26, 2022
Commuters, please make a note that due to the overflow of the Musi River on Jiyaguda 100ft road, the route is temporarily closed and traffic is diverted. @JtCPTrfHyd pic.twitter.com/nPofNIOVx8
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనదారులను అలర్ట్ చేస్తూ వేరే రూట్స్లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో మూసీలోకి వరద పోటెత్తింది.
హియామత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డు బ్రిడ్జి మధ్యలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు.
ప్రవహిస్తున్న వాగుల నుండి వాహనాలు తీసుకెళ్లడం, నడుచుకుంటూ దాటకండి. pic.twitter.com/e3NCPyVvUT
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 26, 2022
ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్ బంద్