-

గోవుకు ముస్లింల అంతిమ సంస్కారాలు

5 Jul, 2021 01:21 IST|Sakshi

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలో ఓ గోమాతకు ముస్లింలు అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండల కో–ఆప్షన్‌ సభ్యుడు షాహెద్‌పాషా ఆరేళ్ల క్రితం దేవుడి పేరుతో ఓ ఆవును వదిలి పెట్టారు. ఆ గోవు ఆదివారం మరణించింది. ఈ విషయం తెలిసిన షాహెద్‌పాషా కుటుంబ సభ్యులు ముస్లిం యువకులతో కలిసి గోమాతకు అంత్యక్రియలు నిర్వహించారు. 
 
 

మరిన్ని వార్తలు