విద్యుత్‌ కోతలపై రైతుల నిరసన 

11 Feb, 2023 02:57 IST|Sakshi
సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు 

నల్లగొండ: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. తిప్పర్తిలో అద్దంకి – నార్కట్‌పల్లి హైవేపై ధర్నా చేశారు. నకిరేకల్, పెద్దవూర, రామన్నపేట మండలాల్లో సబ్‌ స్టేషన్ల ఎదుట ఆందోళన చేపట్టారు. 24 గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ శాఖాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

మరిన్ని వార్తలు