హైదరాబాద్‌ డీఈఓకు జాతీయ పురస్కారం 

13 Feb, 2022 02:59 IST|Sakshi

గన్‌ఫౌండ్రీ: కరోనా కష్టకాలంలో విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్‌ లైబ్రరీ వెబ్‌సైట్‌కు వచ్చిన  విశేష స్పందనకు చక్కటి గుర్తింపు దక్కింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఈ మేరకు శనివారం హైదరాబాద్‌ డీఈఓ రోహిణీకి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా టీఎన్జీఓస్‌ పాఠశాల విద్యాశాఖ విభాగం నగర అధ్యక్షుడు కేఆర్‌.రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.భాస్కర్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు