హెచ్చార్సీలో మంత్రి హరీశ్‌రావుపై కేసు 

13 Apr, 2022 03:54 IST|Sakshi

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ)లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదైంది. కేసును విచారణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు బదిలీ చేశారు. ఈమేరకు మంగళవారం ఫిర్యాదు దారుడు, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు నర్సుల సమస్యలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ.. హరీశ్‌రావుపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు