తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు

13 Jun, 2021 19:58 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ ఉధృతి  కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 15 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,261మంది డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో ప్రస్తుతం 21,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు  6,03,369 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 5,78,748 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ఆదివారం కరోనా కేసుల బులెటిన్‌ను విడుదల చేసింది.  

చదవండి: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

మరిన్ని వార్తలు