తెలంగాణలో కొత్తగా 2,982 కరోనా కేసులు

29 May, 2021 20:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 1,00,677 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,982 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 21 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,837 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,33,862 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 36,917 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,50,27,996 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌ బాధితుల్లో  3247 మంది మృతి చెందారు.

చదవండి: TS: రేపటి నుంచి ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌

మరిన్ని వార్తలు