ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్‌.. నిందితులకు బెయిలిచ్చినా..

3 Dec, 2022 12:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. హైకోర్టు బెయిలిచ్చినా నిందితులు విడుదల కాలేదు. రూ.3 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమకూర్చలేక న్యాయవాదులు తంటాలు పడుతున్నారు. నందకుమార్‌పై పెండింగ్‌ కేసులో బెయిల్‌పై నాంపల్లి కోర్టు శనివారం తీర్పు చెప్పనుంది. కోర్టు ఆర్డర్‌ తర్వాతే నందకుమార్‌ విడుదలపై క్లారిటీ రానుంది.

తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్‌ నోటీసులతో పాటు లుకౌట్‌ నోటీసులు కొట్టేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్‌ అన్నారు.
చదవండి: పాపాలు పండుతున్నాయి.. కవితపై విజయశాంతి షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు