నరసింహుడికి బంగారు సింహాసనం

20 Jun, 2022 02:14 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణంలో వినియోగిం చేందుకు బంగారు పూతతో తయారు చేసిన సింహాసనాన్ని న్యూయార్క్‌కు చెందిన దాతలు సామల ఆర్‌ స్వామి, వీరమణి స్వామి ఆదివారం బహూకరిం చారు. ఈ సందర్భంగా బంగారు పూతతో ఉన్న ఈ సింహాసనానికి ఆలయ ముఖ మండపంలో ఈవో గీతారెడ్డి, ఆలయ ఆచార్యులు పూజలు నిర్వ హించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అధిష్టించి పూజించారు. సింహాసనం విలువ రూ.18 లక్షలు ఉంటుందని దాతలు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు