హోంక్వారంటైన్‌లోకి ఎమ్మెల్సీ కవిత

13 Oct, 2020 20:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్‌ చేశారు. అలాగే కరోనా బారిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
(చదవండి : ఎమ్మెల్యేకు కరోనా, నిన్ననే కవితకు విషెస్‌)
 

మరిన్ని వార్తలు