వాట్సాప్‌లో న్యూడ్‌ కాల్‌.. బ్లాక్‌మెయిల్‌

12 Aug, 2022 08:36 IST|Sakshi
చాటింగ్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు 

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన న్యాయవాది మంగేష్‌కుమార్‌కు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ న్యూడ్‌ కాల్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల 6న ఆయనకు పలుసార్లు వీడియోకాల్‌ వచ్చింది. మొదట వాట్సాప్‌లో హాయ్‌.. హయమ్‌ శివాని అంటూ చాటింగ్‌ చేయగా ఆ న్యాయవాది హూ ఆర్‌యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఆ తర్వాత పలుసార్లు వీడియో కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు.

తర్వాత ఎవరో అని లిఫ్ట్‌ చేస్తే న్యూడ్‌కాల్‌ రావడంతో వెంటనే ఆయన కట్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ పోలీసు పేరిట కాల్‌ చేసి వారికి డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే కేసు నమోదు అవుతుందని బెదిరించారు. తాను న్యాయవాదినని, కేసు పెడతానని మందలించడంతో మిన్నకుండిపోయారు. ఈ విషయమై సైబర్‌ క్రైంలో ఈ నె ల 7వ తేదీన ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించాడు.  

చదవండి: (భార్య ఉందని హత్య జాప్యం.. మసూద్‌ హత్యకు ప్రతీకారంగానే?)

మరిన్ని వార్తలు