సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరి సంఘటనలు పునరావృతం కారాదని మంత్రి కేటీఆర్, స్పెషల్ సీఎస్ల నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్, ఈఎన్సీల వరకు కొంతకాలంగా హెచ్చరించినా విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన 38 మంది ఇంజినీర్లపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారికి ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్ లోకేశ్కుమార్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 13 సర్కిళ్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈఈ), అసిస్టెంట్లు ఇంజినీర్లు(ఏఈ) వీరిలో ఉన్నారు. డీఈఈలే ఈఈలుగా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు వీరిలో ముగ్గురు ఉన్నారు.
ఈ సర్కిళ్లలోని వారికి..
జీతాల కోత పడిన వారిలో అల్వాల్, చందానగర్, శేరిలింగంపల్లి, కాప్రా, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మల్కాజిగిరి, యూసుఫ్గూడ, సంతోష్నగర్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్ సర్కిళ్లకు చెందిన ఇంజినీర్లున్నారు. వారిలో.. ఈఈలు.. కేవీఎస్ఎన్టీ రాజు, సి.శ్రీకాంత్, డి.ఆశాలత, ఆర్.ఇందిరాబాయి, ఆర్. లక్ష్మణ్, యు, రాజ్కుమార్, బి.రాములు, టి.లక్ష్మా, బి.నరేందర్గౌడ్, వి.శ్రీనివాస్ (ఎఫ్ఏసీ), డి.గోవర్ధన్గౌడ్ (ఎఫ్ఏసీ), పి. కష్ణచైతన్య, వి.హరిలాల్(ఎఫ్ఏసీ).
డిప్యూటీ ఈఈలు..
ఎం.కార్తీక్, ఎస్. స్రవంతి, ఎస్.రఘు, పీసీవీ కష్ణకుమార్, ఈ.లౌక్య, ఎస్. శ్రీరాములు, డి.దేవేందర్, ఎం. వెంకటేశ్వర్లు, బి.శంకర్, ఎస్.శిరీష, బి.భానుచందర్.
కె.అరుణ్కుమార్, ఎంవీ శివరామ్ప్రసాద్, సీహెచ్.సునీల్కుమార్, జి.సంతోష్కుమార్రెడ్డి, ఎన్.కౌశిక్, వి.శ్రీనివాసరావు, జి.చరణ్, కె.దివ్యజ్యోతి,ఎండి జమీల్పాషా, ఎస్ఎంఆర్ అన్సారీ, ఎంఏ రహీమ్, ఎల్.బల్వంత్రెడ్డి, టి.సంపత్కుమార్, ఆర్.మల్లారెడ్డి.
(చదవండి: సీఐకి రివర్స్ పంచ్)