విధులకు డుమ్మా కొట్టి.. విందులో చిందులు 

12 Jun, 2021 08:51 IST|Sakshi

పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల నిర్వాకం 

కొండపాక(గజ్వేల్‌): పనివేళల్లో విధులకు డుమ్మా కొట్టి విందులు, వినోదాల్లో మునిగితేలారు సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది. జిల్లాలోని 22 మండలాల పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగులు శుక్రవారం కొండపాక శివారులోని ఓ మామిడి తోటలో సమావేశమై విందులు చేసుకుంటూ చిందులు వేశారు.

ఈ వ్యవహారం కాస్తా టీవీ చానళ్లలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సీరియస్‌ అయ్యారు. కొండపాక ఎంపీడీఓ రాజేశ్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) నర్సింగరావును సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.
చదవండి: Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు!

మరిన్ని వార్తలు