కరోనాతో పంజగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి 

24 Apr, 2021 14:18 IST|Sakshi
విజయ్‌కుమార్‌(ఫైల్‌)

సాక్షి, గాంధీఆస్పత్రి: కరోనా సెకండ్‌ వేవ్‌.. కరోనా వారియర్స్‌పై పంజా విసురుతోంది. పంజగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయ్‌ కుమార్‌చారి కరోనా పాజిటివ్‌తో కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి అతడు మృతి చెందాడు. 2014 బ్యాచ్‌కు చెందిన విజయ్‌కుమార్‌ మృతిపట్ల పోలీస్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు