నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్

6 Aug, 2021 13:09 IST|Sakshi

72వ బ్యాచ్‌కు చెందిన 178 ట్రైనీ ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్ నిర్వహించారు. 72వ బ్యాచ్‌కు చెందిన 178 ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఏపీ, తెలంగాణకు నలుగురి చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు 58 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చారు. 144 మంది ఐపీఎస్‌ ప్రొబేషనరీలతో పాటు 34 మంది ఫారిన్ ఆఫీసర్‌లు శిక్షణ పొందారు. 2019 బ్యాచ్‌లో 73 శాతం టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవారే.

 

మరిన్ని వార్తలు