Photo Feature: రైలు బోగీలు కాదు... ఇసుక లారీలే! 

13 Jun, 2021 11:19 IST|Sakshi

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు వందలాది సంఖ్యలో లారీలు వస్తాయి. కరోనా కారణంగా ఇంతకాలం వీటి  సంఖ్య తక్కువగానే ఉండగా.. లాక్‌డౌన్‌  సడలింపులతో రెండు రోజులుగా సంఖ్య  విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కాళేశ్వరంలోని ఇప్పలబోరు వద్ద లారీలు శనివారం ఇలా మూడు కిలోమీటర్ల మేర నిలిచాయి. ఇవి రైలు బోగీలను తలపించేలా ఉండటంతో అటుగా వెళుతున్న వాహనదారులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు.


చదవండి: ఈ ‘కాక్‌టెయిల్‌’తో కరోనాకు చెక్‌

మరిన్ని వార్తలు