Photo Feature: మేమా.. టైంకు రావడమా..

31 Jul, 2022 19:37 IST|Sakshi
డీఆర్‌డీఏలోని ఆసరా మేనేజర్‌ సెక్షన్‌ పరిస్థితి ఇది 

సాక్షి, ఖమ్మం: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. అధికారులు సహా ఉద్యోగులు, సిబ్బంది అందరూ తమకు ఇష్టం వచ్చిన సమయంలో విధులకు రావడం పరిపాటిగా మారింది. దీంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం ఈ పరిస్థితి కనిపించింది. ఉదయం 10.30 గంటలు దాటినా చాలామంది అధికారులు కార్యాలయానికి రాలేదు. ఆసరా మేనేజర్‌ సెక్షన్, సెర్ప్‌ విభాగం, సెర్ప్‌ ఫైనాన్స్‌ విభాగం, హెచ్‌ఆర్‌ విభాగంతోపాటు పలు సెక్షన్లలో ఉద్యోగులు రాక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.


సెర్ప్‌ ఫైనాన్స్‌ విభాగంలో..


సెర్ప్‌ విభాగంలో..


హెచ్‌ఆర్‌ విభాగంలో ఖాళీ కుర్చీలు

మరిన్ని వార్తలు