బాలిక కిడ్నాప్‌: 24 గంటల్లోనే కథ సుఖాంతం

6 Apr, 2021 10:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో సోమవారం కిడ్నాప్‌ అయిన 9 ఏళ్ల బాలిక ఆచూకీ లభించింది. కిడ్నాప్‌ అయిన 24 గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివారల్లోకి వెళితే.. తట్టి అన్నారం ఆర్కెపురానికి చెందిన ముస్కాన్‌ అనే బాలిక సోమవారం మధ్యాహ్నం అపహరణకు గురైంది. కూతురు కనిపించకపోవడంతో తండ్రి ముస్తాఫా హయత్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముస్కాన్‌ అనే బాలికను ఓ షాపు నుంచి ఓ వ్యక్తి తీసుకొని వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు.

దీని ఆధారంగా నిందితుడిని బాలిక పక్కింటి రాజుగా గుర్తించారు. బాలిక కోసం 30 మందితో కూడిన పది పోలీసు బృందాలు గాలించాయి. నిందితుడు హయత్‌నగర్‌లోని కాలనీలో మంగళవారం తిరుగుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సినిమా చూపిస్తానని చెప్పి బాలికను తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను అపహరించిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పేర్కొన్నారు.

సినిమా చూపిస్తానని బాలిక కిడ్నాప్‌, 

మరిన్ని వార్తలు