పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌

11 Feb, 2022 13:45 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌:  నెల 8 నుంచి ప్రారంభమైన పాలిటెక్నిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అవుతున్నట్లు బోర్డు గుర్తించింది. దీంతో బోర్డు ఇతర జిల్లాలోని కాలేజి ప్రిన్సిపాల్స్‌ను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజ్‌ విద్యార్థులకు వాట్స్‌అప్‌ ద్వారా పేపర్లను పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బోర్డు సెక్రెటరీ ప్రశ్నాపత్రాల లీక్‌ విషయమై ఆ ఇన్‌స్టిట్యూట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజ్‌ పైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు