భిక్కనూరులో పాజిటివ్‌.. నిజామాబాద్‌లో నెగెటివ్‌

27 May, 2021 10:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మృతిచెందిన గర్భిణి కుటుంబీకుల ఆవేదన

20 గంటల వ్యవధిలో రెండు రిపోర్టులు

సాక్షి,భిక్కనూరు: స్థానిక పీహెచ్‌సీలో నిండు గర్భిణి లతకు ఈనెల 24న కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటీనా తరలించారు. 25న ఉదయం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. 20 గంటల వ్యవధిలో రిపోర్టులు రెండువిధాలుగా రావడంతో లత కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు.

లత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. లత పాజిటివ్‌తో మృతిచెందిందా... నెగెటివ్‌తో మృతిచెందిందా అర్థంకాక ఆమె కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు. ఏ రిపోర్టు నిజమో, ఏ రిపోర్టు తప్పో తెలియడం లేదని మృతురాలు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: కరోనా: మార్కెట్‌లోకి 2-డీజీ డ్రగ్ విడుదల

మరిన్ని వార్తలు