ఐక్యతా స్ఫూర్తికి వేదిక అలయ్‌బలయ్‌ 

17 Oct, 2021 03:34 IST|Sakshi

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివారం నిర్వహిస్తున్న అలయ్‌ బలయ్‌ ఉత్సవాల సందర్భంగా బండారు దత్తాత్రేయకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దసరా అనంతరం నిర్వహించే ఈ వేడుకల ద్వారా సమాజంలోని ఐక్యత, సామరస్యస్ఫూర్తి మరింత బలోపేతమవుతాయన్నారు. ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌’ స్ఫూర్తిని పెంపొందించేందుకు, వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారుల నైపుణ్యాల ప్రదర్శనకు గొప్ప వేదికగా నిలుస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.  

మరిన్ని వార్తలు