జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం

3 Sep, 2022 01:45 IST|Sakshi

చిట్యాల: నల్లగొండ జిల్లాలో  హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావె­ల్స్‌ బస్సు దగ్ధమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని వనస్థలి­పురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చీరా­లకు బస్సు ప్రయాణికులతో బయలు­దేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి రాగానే బస్సు టైర్‌ పేలిపోయి మంటలు లేచాయి. ప్రమాద సమయంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపి, బస్సులోని ప్రయాణికులను లేపటంతో వారంతా లగేజీలతో బస్సులోంచి కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. బస్సు దగ్ధమైన సంఘటనపై ఫిర్యాదు అందలేదని చిట్యాల పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు